తంత్ర సాధన :
ఆర్ధిక అభివృద్ధి ప్రసాదించే ధనాకర్షణ తంత్ర ప్రయోగము.
రవి పుష్య యోగం లో కాని, గురు పుష్య యోగం లో కాని ఈ తంత్రాన్ని చేయాలి. పుష్యమి నక్షత్రం వస్తే దానిని పుష్య యోగం అని అంటారు. రవివారము, గురువారాలలో పుష్యమి నక్షత్రం వచ్చినపుడు ఆచరించటం మంచిది. ఆ రోజు ఉదయం "ఉత్తరేణి" మొక్క దగ్గరికి వెళ్లి, పూజించి, మీ అవసర నిమిత్తం చెట్టును భూమి నుండి తీసుకుంటున్నారని, మిమ్మల్ని క్షమించి అనుగ్రహించ వలసినదిగా ప్రార్దించాలి. ఆ తరువాత, చెట్టును తీసెసి, చెట్టు వేరును మాత్రం తీసుకుని రావాలి. ఇంటికి తీసుకు వచ్చిన తరువాత, ముందుగా గోమూత్రంతో కాని, ఆవు పాలతో కాని శుభ్రం చేసి, ఆ తరువాత మంచి నీటితో శుభ్రపరచాలి. ఆ తరువాత, వేరును ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి, ఆ వేరుకు షోడశోపచార పూజ అంటే, ధూపం అర్పించి, మట్టి ప్రమిదలలో నేతితో కాని, నువ్వుల నూనెతో కాని దీపాలు వెలిగించి, పసుపు, కుంకుమ, అక్షతలు, ఎర్రని పుష్పాలతో పూజించి, ఏదైనా తియ్యటి పదార్ధాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా పూజ పూర్తి చేసాక ఎరుపు రంగు వస్త్రంలో వేరు తో పాటు, ఒక వక్క, , ఒక ఖర్జూరం, రెండు రూపాయి బిళ్ళలు వేసి, ఆ వస్త్రాన్ని మూట కట్టి, మరల ఒకసారి ధూపం చూపించి, ఇంటిలో లేదా వ్యాపార స్థలంలో డబ్బును భద్రపరిచే చోట పెట్టాలి. ఈ తంత్ర ప్రక్రియ చేయడం వలన మీకు మంచి ధన ప్రాప్తి, ధనాకర్షణ, ఆర్ధిక అభివృద్ధి లభిస్తుంది.
శ్రీ మాత్రే నమః
-- సేకరణ, అవ్యజ్ (Shankar)
ఆర్ధిక అభివృద్ధి ప్రసాదించే ధనాకర్షణ తంత్ర ప్రయోగము.
రవి పుష్య యోగం లో కాని, గురు పుష్య యోగం లో కాని ఈ తంత్రాన్ని చేయాలి. పుష్యమి నక్షత్రం వస్తే దానిని పుష్య యోగం అని అంటారు. రవివారము, గురువారాలలో పుష్యమి నక్షత్రం వచ్చినపుడు ఆచరించటం మంచిది. ఆ రోజు ఉదయం "ఉత్తరేణి" మొక్క దగ్గరికి వెళ్లి, పూజించి, మీ అవసర నిమిత్తం చెట్టును భూమి నుండి తీసుకుంటున్నారని, మిమ్మల్ని క్షమించి అనుగ్రహించ వలసినదిగా ప్రార్దించాలి. ఆ తరువాత, చెట్టును తీసెసి, చెట్టు వేరును మాత్రం తీసుకుని రావాలి. ఇంటికి తీసుకు వచ్చిన తరువాత, ముందుగా గోమూత్రంతో కాని, ఆవు పాలతో కాని శుభ్రం చేసి, ఆ తరువాత మంచి నీటితో శుభ్రపరచాలి. ఆ తరువాత, వేరును ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి, ఆ వేరుకు షోడశోపచార పూజ అంటే, ధూపం అర్పించి, మట్టి ప్రమిదలలో నేతితో కాని, నువ్వుల నూనెతో కాని దీపాలు వెలిగించి, పసుపు, కుంకుమ, అక్షతలు, ఎర్రని పుష్పాలతో పూజించి, ఏదైనా తియ్యటి పదార్ధాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా పూజ పూర్తి చేసాక ఎరుపు రంగు వస్త్రంలో వేరు తో పాటు, ఒక వక్క, , ఒక ఖర్జూరం, రెండు రూపాయి బిళ్ళలు వేసి, ఆ వస్త్రాన్ని మూట కట్టి, మరల ఒకసారి ధూపం చూపించి, ఇంటిలో లేదా వ్యాపార స్థలంలో డబ్బును భద్రపరిచే చోట పెట్టాలి. ఈ తంత్ర ప్రక్రియ చేయడం వలన మీకు మంచి ధన ప్రాప్తి, ధనాకర్షణ, ఆర్ధిక అభివృద్ధి లభిస్తుంది. శ్రీ మాత్రే నమః
-- సేకరణ, అవ్యజ్ (Shankar)
No comments:
Post a Comment