ప్రాతః కాల శ్లోకం
ఇది చాలామందికి బాగా తెలిసిన, అందరు చెప్పే శ్లోకమే. కానీ ఈ కంప్యూటర్ యుగంలో, ఆండ్రాయిడ్ మనుషులలో ఆచరించే వారు మాత్రం చాలా కొద్ధి మంది మాత్రమే. అందుకే కొంతైనా భవిష్యత్తు తరాల వారికి ఉపయోగం అనే ఉదేశ్యంతో ..
" కరాగ్రే వసతే లక్ష్మి , కరమధ్యే సరస్వతి
కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కర దర్శనం "
ఈ శ్లోకం ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచిలేవగానే అరచేతులు చూచుకుంటూ చదువుకోమని పెద్దల మాట. అనవసరమైన విషయాలు పరగడుపునే చేసే చర్చవలన ఆ రోజు మొత్తం అదే మనస్తత్వంని మోసుకుంటూ వెళ్లినట్లు ఉంటుంది. అలాగే దీనితో పాటు సాధారణంగా మంచం పైనుండి దిగకుండానే ఈ విధంగా పృథివి మాతను , సప్తసముద్రాలను, గురువులను, సప్తఋషులను, మాతృ పితరులను, సప్త ద్వీపాలను, గంగ, నర్మదా ఇత్యాది పుణ్యనదులను కూడా స్మరించాలి . దీనినే మానసిక స్నానం అంటారు. ఇలా రోజును ప్రారంభించాలి అని ఆ రోజు విజయంగా సాగుతుంది అని సద్గ్రంథ వచనం.
No comments:
Post a Comment